టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఆ దేశానికి సాయం చేసింది భారత్యే. ముందుగా మన దేశమే స్పందించి సహాయక చర్యలు అందించింది. అన్ని రకాలుగా ఆదుకుంది. కానీ ఇదంతా మర్చిపోయిన టర్కీ మాత్రం భారత్పై విషం చిమ్మింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్తో చేతులు కలిపి.. దాయాది దేశానికి మద్దతు ఇచ్చింది. భారత్పై దాడి చేసేందు కోసమని 350కి పైగా డ్రోన్లను పాకిస్థాన్కు అందజేసింది. ఇదంతా ఇప్పటికే అందరికీ తెలియగా.. భారత్ టర్కీపై దిగుమతులపై నిషేధం విధించింది. ఈ సమయంలోనే ఆ దేశం చేసిన మరిన్ని దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్లు మాత్రమే కాకుండా సైనికులను కూడా పాక్కు పంపి.. మన దేశంపై దాడికి ఉసిగొల్పినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్, టర్కీ దేశాల మధ్య ఇటీవల కాలంలో భారీగా సంబంధాలు పెరిగాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఒకరికొకరు అండగా నిలబడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దాయాది దేశంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టగా పాక్ కూడా ప్రతిదాడులకు పాల్పడింది. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించగా.. వాటిని కూల్చి వేసింది. ఆపై ఆ శకలాలను గుర్తించి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలంచారు. అప్పుడే వారికి ఇవన్నీ టర్కీకి చెందిన "ఆసిస్ గార్డ్ సోనగర్" డ్రోన్లు అని తెలిశాయి.
ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారికంగా వెల్లడించగా.. భారతీయులంతా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా పుణేలోని వ్యాపారులు టర్కీ నుంచి వస్తున్న పండ్లపై నిషేధం విధించారు. యాపిల్స్ను అస్సలే దిగుమతి చేసుకోవడం లేదు. దీని ఫలితంగా ఆ దేశానికి 1200 రూపాయల కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే టర్కీ చేసిన మరికొన్ని దుస్సాహసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు డ్రోన్లను పంపిన టర్కీ.. వీటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలటరీకి చెందిన వ్యక్తులను ఇస్లామాబాద్కు పంపినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్కు మొదటి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఈ విషయాన్ని ఆయనే నేరుగా అనేక సందర్భాల్లో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం ఉగ్రవాదుల చర్యలను ఖండించింది. కానీ టర్కీ అధ్యక్షుడు మాత్రం కనీసం స్పందించ లేదు. అమాయక పర్యటకుల మృతికి సానుభూతి కూడా తెలపలేదు. ఉగ్రవాద చర్యను కూడా ఖండించలేదు. ఇదంతా పక్కన పెడితే.. దాయాది దేశానికి మద్దతుగా నిలుస్తూ.. పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ను ఎర్దొగాన్ కలిశారు. వారికి సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.
![]() |
![]() |