ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవర్నైనా రీప్లేస్ చేసుకోవచ్చు.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు బంపరాఫర్

sports |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 11:22 PM

ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ బంపరాఫర్ ఇచ్చింది. అయితే, ఈ ఆఫర్ ఈ సీజన్ వరకే పరిమితం అంటూ కండీషన్ పెట్టింది. భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 కొద్ది రోజులు వాయిదా పడింది. దాంతో ఫారెన్ ప్లేయర్స్ అంతా తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొంతమంది తిరిగి భారతదేశానికి రాలేకపోతున్నారు. దాంతో వాళ్ల కోసం తాత్కాలిక రూల్‌ని ప్రవేశపెట్టింది.


ఎవరైనా విదేశీ ఆటగాళ్లు తిరిగి రాలేని పక్షంలో వాళ్ల స్థానంలో ఎవర్నైనా తీసుకోవచ్చని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ వెల్లడించింది. అయితే, ఈ అవకాశం కేవలం ఈ సీజన్ వరకే పరిమితమని చెప్పింది. వాళ్లని తిరిగి ఐపీఎల్ 2026లో కొనసాగించే అవకాశం లేదు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్, ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్‌ల నేపథ్యంలో బీసీసీఐ ఈ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది.


ఈ రూల్ ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ స్థానంలో ముస్తాఫిజుర్‌ని రీప్లేస్ చేసుకుంది. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా జెమీ ఓవర్టన్ స్థానాన్ని రీ ప్లేస్ చేయనుంది. ఐపీఎల్‌ తెచ్చిన ఈ తాజా రూల్ ప్రకారం ఎవరైతే ఓవర్సీస్ ప్లేయర్లు తిరిగి భారత్‌కి రాలేకపోతారో.. వాళ్ల స్థానాన్ని కచ్చితంగా రీ ప్లేస్ చేసే అవకాశం ఉంది.


ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కి అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇంగ్లండ్ ప్లేయర్లేమో వెస్టిండీస్ టూర్‌లో బిజీగా ఉండనుండగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోనున్నారు. దాంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకునే ఫ్రాంఛైజీలు తప్పక రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 వాయిదా పడే ముందే ఆయా ఫ్రాంఛైజీలు సెడీఖుల్లా అటల్, మయాంక్ అగర్వాల్, ప్రిటోరియస్, బర్గర్ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com