ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడి రోడ్డుపై విద్యుత్ స్తంభాలు.. రాకపోకలకు అంతరాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 15, 2025, 11:57 AM

మండల కేంద్రమైన చంద్రశేఖరపురంలో నడి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. చంద్రశేఖరపురం నుంచి డిజిపేటకు వెళ్ళే రోడ్డులో నాలుగైదు చోట్ల విద్యుత్ స్తంభాలు నడిరోడ్డుపై ఉండడం వలన వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించడంలో సమస్యలు వస్తున్నాయి. ఈ స్తంభాలు వున్న ప్రాంతాల్లో రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చినప్పుడు, ఒక్కొక్కటి ముందుకు వెళ్లడానికి అవకాసం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడిపోతున్నారు.
ఈ విషయంలో స్థానిక ప్రజలు, వాహనదారులు అధికారులు త్వరగా స్పందించి, నడిరోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని కోరుతున్నారు. రాకపోకలకు అనుకూలమైన మార్గాన్ని ఏర్పరచడానికి అధికారులు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి. స్థానికులు, వాహనదారులు ఈ స్తంభాలు తొలగించే వరకు ఇబ్బందులు చవిచూస్తున్నా, అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని అందరూ కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com