ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2026 ఆడనున్న మహేంద్ర సింగ్ ధోనీ...ఇప్పట్లో రిటైయిడ్ మెంట్ లేనట్లేనా

sports |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 08:51 PM

ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమైనప్పుడల్లా అందరిలోనూ ఒకటే ప్రశ్న. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు? ఈ ఏడాదే మిస్టర్ కూల్‌కి లాస్ట్ సీజనా? ప్రతి ఏడాది ఇవే క్వశ్చన్స్..! ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ధోనీ రిటైర్మెంట్ గురించి పెద్ద చర్చే జరిగింది. ఐపీఎల్ 2025 మధ్యలోనే రిటైర్మెంట్ ఇస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఎంఎస్‌డీ ఐపీఎల్ 2026 కూడా ఆడనున్నట్లు క్లారిటీ వచ్చింది.


చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 కూడా అందుబాటులో ఉండనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం లేదంటూ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ 2026 కూడా ఆడాలని ధోనీ బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీ టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించి ది బెస్ట్ టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.


2014లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. 2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై మ్యాచ్‌నే ధోనీకి చివరి వన్డే. సెమీస్‌లో ఓడిన తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఎలాంటి హడావుడి లేకుండా వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు.


ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా 2021, 2023లో ధోనీ కెప్టెన్సీలోనే సీఎస్కే ట్రోఫీలు అందుకుంది.


ఐపీఎల్ 2023లో టైటిల్ గెలిచిన తర్వాత సీఎస్కే పగ్గాలను యువకుడైన రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. అయితే వరుసగా గైక్వాడ్ విఫలం కావడం, ఈ సీజన్ మధ్యలో గాయంతో ఐపీఎల్‌కు దూరం కావాల్సి వచ్చింది. దాంతో మళ్లీ ధోనీనే పగ్గాలు చేపట్టాడు. అయినప్పటికీ ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త పర్ఫార్మెన్స్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగున పడి ఉంది.


ధోనీ రిటైర్మెంట్ గురించి ఎన్నో సార్లు కామెంటేటర్లు ప్రశ్నించినప్పటికీ నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఫ్యాన్స్ కోసం ఇంకొంత కాలం ఆడాలని ఉందని చెప్పాడు. తన లాస్ట్ మ్యాచ్ చెన్నై చెపాక్‌లోనే అని ధోనీ ముందుగానే చెప్పాడు. ఈ సీజన్‌లో సీఎస్కే‌కు చెపాక్ వేదికగా ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దాంతో పాటు ధోనీ కూడా వచ్చే సీజన్‌లో ఆడాలనే ఆసక్తితో ఉండటంతో.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో మునిగిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com