ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాల తరహాలో బస్సుల్లో కూాడా,,,,ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:32 PM

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నిరోధించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కొత్త బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సెన్సార్‌తో నడిచే ఫైర్‌ అలారాన్ని అమర్చుతున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగితే అదుపు చేసేందుకు బస్సుల్లో సిలిండర్లు ఉంచుతున్నారు. విజయవాడ విద్యాధరపురం డిపోలోని కొత్త బస్సుల్లో ప్రస్తుతం ఈ పరికరాలను అమర్చారు. ఇకపై అన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సుల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ అధికారులు.


ఒకవేళ బస్సుల్లో చిన్న పాటి పొగ లేదా స్పార్క్ రాగానే ప్రయాణికులను హెచ్చరించే వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. ఈ మేరకు ప్రయాణికుల భద్రత దృష్ట్యా సెన్సార్లతో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ముందుగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. విమానాల్లో ఏర్పాటు చేస్తోన్న తరహాలో సెన్సార్లతో పనిచేసే ఫైర్ అలారం వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల ప్రాణాలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది.


మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, బస్సులను ట్రాక్ చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా బస్సు ఎక్కడ ఉంది, ఏ రూట్‌లో వెళ్తుంది వంటి వివరాలను తెలుసుకోవచ్చు. గతంలో ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇప్పుడు పల్లె వెలుగు సహా బస్సులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ ట్రాకింగ్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ బస్సుల వివరాలను తెలుసుకోవచ్చు. బస్సు డిపో నుండి బయలుదేరిన దగ్గర నుండి గమ్యస్థానానికి చేరే వరకు సమాచారం తెలుసుకోవచ్చు.. ఈ మేరకు ఈ ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.


గతంలో ఉన్న పాత విధానాన్ని తొలగించి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. పాత డివైజ్డ్ సిస్టమ్ స్థానంలో టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. టిమ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిమ్ నెట్‌వర్క్ ద్వారా బస్సు ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు. లైవ్ ట్రాకింగ్ కోసం ఆర్టీసీ ఆన్‌లైన్ బస్ ట్రాకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ‘సెర్చ్ ఫర్ బసెస్ బిట్వీన్ టు లొకేషన్స్(ఫ్రం-టు)’లో బస్సులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. అందులో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ వివరాలు ఇవ్వాలి. బస్సుకు సంబంధించిన సర్వీసు నంబరు కొడితే బస్సు ఎక్కడ ఉందో తెలుస్తుంది. దీంతోపాటు లైవ్ లొకేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో లైవ్ లొకేషన్ రాదు.. ఇంకా కొన్ని రూట్లలో జియో మ్యాపింగ్ చేయాల్సి ఉంది. త్వరలో ఇది కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com