ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిషేక్ శర్మ,,, దిగ్వేష్ రాథీ డిష్యుం డిష్యుం

sports |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 11:48 PM

ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మకు కోపం వచ్చింది. ఈ మ్యాచ్‌లో వరుస సిక్సర్లతో చెలరేగిపోయిన అతడు.. ఔట్ అయ్యాక బౌలర్ చేసిన పనితో ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో అతడితో మాటలయుద్ధానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.


 అసలేం జరిగిందంటే?


లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఫస్టు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 205 రన్స్ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు శుభారంభం అందించాడు. ట్రావిస్ హెడ్‌కు కరోనా సోకడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అథర్వ ట్రేడ్‌.. అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అథర్వ ట్రేడ్ (9 బంతుల్లో 13 రన్స్) ఔట్ అయినా అభిషేక్ మాత్రం ఛేజింగ్‌లో జోరు చూపించాడు.


ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు కొడుతూ అభిషేక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో చుక్కలు చూపించాడు. చివరి నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు తిరిగింది. అయితే ఆ తర్వాతి ఓవర్‌ వేసేందుకు దిగ్వేష్ రాథీ వచ్చాడు.


ఈ ఓవర్‌లో అభిషేక్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొచ్చాడు. కానీ టైమ్‌ కాకపోవడంతో ఆ బంతి వెళ్లి శార్దూల్ ఠాకూర్ చేతిలో పడింది. దీంతో దిగ్వేష్ తనదైన శైసిలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది అభిషేక్‌కు కోపం తెప్పించింది. దీంతో అతడు దిగ్వేష్ వైపు దూసుకెళ్లాడు. దిగ్వేష్ కూడా అదే విధంగా స్పందించడంతో పరిస్థితి హీటెక్కింది. ఇరువురి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. చివరకు అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 20 బంతుల్లో 59 రన్స్ చేశాడు. ఇందులో ఆరు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత అతడి బౌలింగ్‌లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఫోర్లు సిక్సర్లు కొట్టారు. దీంతో స్టేడియంలో ఉన్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్ దిగ్వేష్ స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com