ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు చనిపోయిన వారిని బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది ఆలయానికి వెళ్లి.. దర్శనం చేసుకుని.. తిరిగి ఊరికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కారు, లారీ ఢీకొనటంతో వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు గాయపడిన చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 163పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
ఈ హృదయ విదారక ఘటనతో స్టూవర్టుపురం గ్రామంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందడం.. అందులోనూ పెద్దవాళ్లు చనిపోయి.. ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మిగిలిపోవటం.. అందరి మనసులను మెలిపెడుతోంది. మహానంది దర్శనం ముగిసిన ఆనందం ఆవిరై, రోదనలు మిన్నంటుతున్నాయి.
![]() |
![]() |