ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్ లో నిన్న కుప్పకూలిన ఎయిరిండియా విమానం మృతుల కుటుంబాలను పరామర్శించనున్న ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 13, 2025, 09:36 AM

అహ్మదాబాద్ లో నిన్న పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa