ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెలికాప్టర్ కూలి ఏడుగురు కేదార్‌నాథ్ భక్తులు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:44 PM

ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తోన్న హెలికాప్టర్ కూప్పకూలింది. గుప్తకాశీ సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌లో ఆరుగురు భక్తులు, పైలట్ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ కారణంగానే హెలికాప్టర్ కూలినట్టు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి. మురుగేశన్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు ధ్రువీకరించారు. ఆ హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారని తెలిపారు. సాంకేతికలోపం కారణంగానే ప్రమాదం జరిగిందని, క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం సంభవించి 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


కేదారనాథ్ మందిరానికి భక్తులను దించిన తరువాత, ఆ విమానం తిరిగి అక్కడ భక్తులను ఎక్కించుకుని గౌరికుండకు బయలుదేరింది. అయితే రుద్రప్రయాగ్ జిల్లాలోని త్రిజుగినారాయణ- గౌరికుండ మధ్య లోహవిహంగం అదృశ్యమైంది.


పౌరీ గఢ్వాల్ పరిధి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) రాజీవ్ స్వరూప్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కేదార్‌నాథ్ నుంచి వస్తున్నహెలికాప్టర్ ప్రమాదవశత్తూ కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం మారుమూల ప్రాంతం అని చెప్పారు. పోలీసు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరినట్టు వెల్లడించారు. ఆరు వారాల్లో జరిగిన ఐదో ఘటన ఇది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ కూలిన విషయంలో అత్యంత విచారకరమైన వార్త అందింది. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రక్షణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాణికులందరి సురక్షితంగా ఉండాలని ఆ కేదార్‌నాథుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.


కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్‌లో ఉన్నవారు ప్రాణాలతో ఉన్నారా? లేదా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉండగా గత నెలలోనూ కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తోన్న హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. మే 8న కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా.. ఉత్తర కాశీలోని గంగోత్రి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనంతపురం టీడీపీ ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నారు. లక్ష్మీనారాయణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతిచెందారు. వేదవతి భర్త భాస్కర్‌ గాయాలతో ప్రమాదం నుంచి గాయపడ్డారు. ఈ ఏడాది ఛార్‌ధామ్ యాత్ర మొదలైన తర్వాత తాజా ఘటనతో కలిసి ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa