ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. శనివారం ఉదయం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్తో పాటు పలు ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ను శక్తివంతమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఆపలేకపోయింది. దీంతో కొన్ని మిసైల్స్ టెల్ అవీవ్లోని నివాస ప్రాంతాల్లో పడ్డాయి. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 21 మంది గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడి చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తొలుత ఇరాన్ అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణు శాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa