ఆంధ్ర ప్రీమియర్ లీగ్ – 4 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సందడి చేశారు. విశాఖ ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఏపీఎల్ – 4 ట్రోఫీని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, శ్రీభరత్, ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్ బాబు, ఏపీఎల్ గవర్నెన్స్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటి ప్రజ్ఞా జైస్వాల్ చేసిన నృత్య ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సీజన్లో 7 జట్లు 25 మ్యాచ్లు ఆడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa