ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టంగా నిలిచిన 2008 స్లాప్గేట్ ఘటన మళ్లీ చర్చకు దారి తీసింది. లలిత్ మోదీ , మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కలిసి ఆ ఘటన వీడియోను ఇటీవల బహిరంగం చేయడంతో, క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాబిన్ ఆస్ట్రేలియా క్రికెటర్లను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశాడు.
ముంబై ఇండియన్స్ – పంజాబ్ మ్యాచ్లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్పై కోపంతో చెంపదెబ్బ కొట్టడం ఆ సమయంలో సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు గాను హర్భజన్పై 11 మ్యాచ్ల నిషేధం విధించగా, ఇద్దరు ఆటగాళ్లు కాలక్రమేణా మనస్పర్థలు పక్కన పెట్టి స్నేహపూర్వకంగా మెలగడం ప్రారంభించారు. అనేక ఇంటర్వ్యూలలో హర్భజన్ తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పగా, శ్రీశాంత్ కూడా సానుకూలంగా స్పందించాడు. ప్రస్తుతం వీరిద్దరూ వ్యాఖ్యాతలుగా, ప్రమోషన్లలో కలిసి కనిపిస్తున్నారు.
కానీ, ఇప్పుడు ఆ వీడియోను మళ్లీ బయటపెట్టడం “పాత గాయం మళ్లీ తీయడమే"నని మాజీ టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప మండిపడ్డాడు. కిమ్-అప్పా షోలో మాట్లాడుతూ, ఉతప్ప మైఖేల్ క్లార్క్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఆ స్లాప్గేట్ విషయం.. అలాంటి విషయం ఎవరైనా ఇలా బహిరంగం చేస్తారా? ఆస్ట్రేలియా క్రికెట్లోనూ ఇలాంటివి జరిగాయి. కానీ వాటిని ఆటగాళ్ల గౌరవం కోసం బయటపెట్టలేదు. మరి మాకు ఎందుకు? 20 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మళ్లీ ఆ మానసిక వేదనను అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు తెస్తున్నారు?” అని ఉతప్ప ప్రశ్నించారు.
“గోధుమ చర్మం లేని వాళ్లు చాలా సులభంగా తప్పించుకుంటారు. కానీ భారత క్రికెటర్ల విషయంలో మాత్రం తప్పు పదేపదే రచ్చ చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? మనమంతా మనుషులమే, తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పును మళ్లీ మళ్లీ బయటపెట్టి అవమానించడం ఎవరికి ఉపయోగం? ఇలా చేసి మరీ వ్యూస్ సంపాదించడం కోసం మనుషుల గౌరవాన్ని తాకట్టుపెట్టకూడదు. ఇది ఎవరికీ ఉపయోగపడదు” అని ఉతప్ప నిలదీశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa