ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పిన్నర్ల రూపంలో పాక్ నుంచి కొత్త ముప్పు.. టీమిండియాను హెచ్చరించిన మాజీ ప్లేయర్

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 09:57 PM

ఆసియా కప్ 2025లో భారత్ - పాకిస్తాన్ పోరు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి సమయంలో పాక్ తీసుకున్న కొత్త వ్యూహం గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశారు. ఓమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ నలుగురు ప్రత్యేక స్పిన్నర్లను ఆడించింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా అవసరమైతే బౌలింగ్ చేయగలిగే ఆప్షన్ ఉన్నా, ఆయన్ను వాడలేదు. అయినప్పటికీ, స్పిన్ దళం ఆధిపత్యం చెలాయించి పాకిస్తాన్‌కు 93 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఇందులో సయీం అయూబ్, సుఫియాన్ ముకీమ్ తలా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందికి గురిచేశారు.


“భారత్‌కి ఇది కొత్త అనుభవం అవుతుంది. సాధారణంగా పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నప్పుడు ఫాస్ట్ బౌలర్లు కీలకంగా ఉంటారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. పేస్‌ దాదాపుగా కనిపించదు. ఈ కాంబినేషన్‌ భారత్ బ్యాటర్లకు కొత్త సవాల్ అవుతుంది” అని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కి తెలిపాడు.


అయితే బ్యాటింగ్‌లో ఇంకా కొంత మెరుగుదల అవసరమని మంజ్రేకర్ సూచించాడు. “హెసన్ అందుబాటులో ఉన్న వనరులను చాకచక్యంగా వాడుతున్నాడు. సయీం అయూబ్ ఇప్పటివరకు పాకిస్తాన్ తరఫున అంతగా బౌలింగ్ చేయలేదు. కానీ హెసన్ కింద ఆడిన ఇన్నింగ్స్‌లో దాదాపు 90 శాతం ఓవర్లు వేశాడు. ఇది కొత్త ఆలోచన, ఆసక్తికరంగా ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఓమన్ మ్యాచ్‌లో స్పిన్ ఆధిపత్యం చూసి ఆశ్చర్యపోయానని కూడా మంజ్రేకర్ చెప్పాడు. “మొదటి ఆరు నుంచి ఎనిమిది ఓవర్లలో చూడండి - కేవలం రెండు ఓవర్లు పేస్, మిగతా అన్నీ స్పిన్! అదొక అద్భుత దృశ్యం” అని వ్యాఖ్యానించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa