ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాకాలంలో పెరుగు తింటే ఈ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే

Recipes |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 10:22 PM

అన్నంలోకి పెరుగు లేదు. దీంతో తిన్నా కూడా తిన్నట్లుగానే లేదని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. అవును, చాలా మంది ఇదే కేటగిరీకి చెందుతారు. పెరుగు కేవలం మన కడుపు నింపడానికి మాత్రమే కాదు. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతగానో మంచిది. ఇందులో ప్రోబయోటిక్స్, పోషకాలు అంటే కాల్షియం, ప్రోటీన్, బి విటమిన్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచివి. దీంతో పాటు ఎముకలు బలంగా మారతాయి. ఇమ్యూనీటీ పెరగడమే కాకుండా బరువు తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. దీనిని రెగ్యులర్‌గా తింటే ఆరోగ్య పరంగానే కాదు, అందానికి కూడా చాలా మంచిది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల స్కిన్ నేచురల్‌గానే ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇన్ని లాభాలున్న పెరుగుని వర్షాకాలంలో అవాయిడ్ చేయడమే మంచిదని చెబుతున్నారు డాక్టర్ వరలక్ష్మీ. ఒకవేళ తిన్నా కూడా సరైన విధంగా తింటేనే కొన్ని ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చొని చెబుతున్నారు. మరి అదెలానో తెలుసుకోండి.


వర్షాకాలంలో పెరుగు తింటే నష్టాలు


పెరుగులోని గుణాలు చలువ చేస్తాయి. వర్షాకాలంలో పెరుగు తింటే బాడీలో శ్లేష్మం పెరుగుతుంది. దీని వల్ల మనది మనకే ఓ రకమైన హెవీనెస్ ఉంటుంది. దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి.


అంతేకాదు, ఎండాకాలంలో పెరుగు తింటే మంచిదో వర్షాకాలంలో అన్ని నెగెటీవ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. చర్మ ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది. మొటిమ్మలు, దద్దర్లు వంటి చర్మ సమస్యలకి కారణమవుతుంది. ​


తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తింటే కీళ్ళు మరింత గట్టిగా మారి కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. కాబట్టి, వర్షాకాలంలో పెరుగుని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.


వర్షాకాలంలో పెరుగు తింటే నష్టాలు


​జీర్ణ సమస్యలు


అంతేకాకుండా, ఆయుర్వేదం ప్రకారం చల్లని వాతావరణంలో పెరుగుతు తింటే జీర్ణవ్యవస్థలోని అగ్ని బలహీనంగా మారుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే, ఎప్పుడైనా సరే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెరుగు తినొద్దు. జీర్ణ సమస్యలు వస్తే మిగతా ప్రాబ్లమ్స్ ఆటోమేటిగ్గా వస్తాయి. కాబట్టి, అలా కాకుండా సరైన విధంగా తీసుకోవాలి.


శ్వాసకోశ సమస్యలు


ముందుగా చెప్పుకున్నట్లుగా చల్లని వాతావరణంలో పెరగు తింటే బాడీలో మ్యూకస్ పెరుగుతుంది. దీంతో ప్రమాదకరమైన శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దీంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటివన్నీ వస్తాయి. దీనికి కారణం పెరిగిన తేమ. దీని వల్ల అలర్జీలు పెరిగి సమస్యలు వస్తాయి. కాబట్టి, పెరుగుని ఎంత వీలైతే అంతలా అవాయిడ్ చేయండి.


ఇమ్యూనిటీ


వర్షాకాలంలో ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ తగ్గితే చాలా వరకూ సీజనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే, మనం వర్షాకాంలో పెరుగు గనుక తింటే ఇమ్యూనిటీ తగ్గుతుందని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. దీనికి కారణం బాడీలో మ్యూకస్ పెరగడం వల్ల గట్ హెల్త్ దెబ్బతిని దీని వల్ల మొత్తం బాడీపైనే నెగెటీవ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, పెరుగుకి దూరంగా ఉండడం మంచిది.


ఎలా తింటే మంచిది


వర్షాకాలంలో పెరుగు తింటే వచ్చే సమస్యల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన డాక్టర్ వరలక్ష్మీ. దానికి నివారణలుగా కొన్ని టిప్స్‌ని కూడా షేర్ చేసుకుంటున్నారు. అవి


ఒకేసారి అధిక మొత్తంలో కాకుండా కొద్దిపరిమాణంలో తీసుకోండి.


రాత్రుళ్ళు అసలు తీసుకోకపోవడమే మంచిది.


సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే జీలకర్ర లేదా నల్ల ఉప్పు వంటి మసాలాలు వేసుకోండి. దీంతో చాలా వరకూ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.


మరీ తినాలనిపిస్తే పల్చగా చేసి మజ్జిగలా తీసుకుంటే కాస్తా ఎఫెక్ట్ తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa