ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం నడుస్తోంది. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లోకి విస్తరించేసింది. మానవుడికి పరిష్కారం అందని అనేక సమస్యలు, సవాళ్లను ఏఐ సులభంగా పరిష్కరిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. భారత్లో కూడా అన్ని రంగాల్లో ఏఐకు ప్రాధాన్యం కల్పించారు. తాజాగా, బ్యాంకులు కూడా ఏఐ సేవలను వినియోగించడం ప్రారంభించాయి. లోన్ రికవరీ కోసం బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతున్నాయి. AI అవతార్స్ ద్వారా లోన్ తీసుకున్న వారికి వీడియో కాల్స్, మెసేజ్లు పంపుతూ రీమైండర్స్ ఇస్తున్నాయి. ఈ విధానం చాలా నచ్చినందున పలు ప్రభుత్వ బ్యాంకులు కూడా దీన్ని సమీక్ష చేస్తున్నారు. ఉద్యోగుల నియామకం కంటే ఇది ఎంతో చీప్ & సమర్థవంతం అని బ్యాంకులు భావిస్తున్నాయి.దేశంలోని బ్యాంకులు లోన్ రికవరీ కోసం AI టెక్నాలజీని ఆధారంగా తీసుకుంటున్నాయి. మానవులతో పోలిస్తే, AI అవతార్స్ చీప్గా ఎక్కువ డీల్లు చేయగలవు. ఓవైపు RBI నిబంధనలను పాటిస్తూ, మరోవైపు లోన్ రికవరీ వేగవంతం చేయడం కోసం బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవి లాయర్ల మాదిరి వ్యవహరిస్తూ, లోన్ రీ-పేమెంట్ను గుర్తు చేస్తాయి.ఒక లోన్ రికవరీ ఏజెంట్ నెలకు సుమారు రూ.30,000 సంపాదించి 250 కేసులు నిర్వహిస్తే, AI అవతార్స్ 20 రెట్లు ఎక్కువ కేసులను డీల్ చేయగలవు. అంతేకాదు, వీటికి అయ్యే ఖర్చు కూడా 40–60% తక్కువ. ఇప్పటివరకు పలు ప్రైవేట్ బ్యాంకులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి, కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ విధానం ఇంకా అమల్లోకి రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa