రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్: గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు మంచి వార్త చెప్పింది. గ్రూప్ C మరియు గ్రూప్ D స్థాయి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) అందించనున్నట్టు ప్రకటించింది.ప్రభుత్వం 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ను ఆమోదించింది. లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్ వైజర్లు, టెక్నీషియన్లు, ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ C, D ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుంది.
*ఒక్కో ఉద్యోగికి రూ. 17,951 :ఈ బోనస్ కోసం రైల్వే శాఖ సుమారు ₹2029 కోట్ల వ్యయాన్ని అంగీకరించింది. ఈ మేరకు, ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి ₹17,951 వరకు అందనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా సుమారు 11 లక్షల మందికి పైగా నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
*బోనస్ చెల్లింపు: దసరా/దుర్గాపూజ పండుగలకు ముందు :ఈ బోనస్ సాధారణంగా దసరా లేదా దుర్గాపూజ పండుగలకు ముందు చెల్లిస్తారు. రైల్వే ఉద్యోగుల పనితీరు మరియు ఉత్పాదకతను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ బోనస్ ప్రకటిస్తుంది.అయితే, బోనస్ లెక్కింపులో 6వ వేతన సంఘం ప్రకారం ₹7000 ప్రాతిపదికన లెక్కించడం పై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. వారు 7వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం ₹18,000గా ఉందని, బోనస్ లెక్కింపు కూడా అదే ఆధారంగా చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం పాత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa