ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, పలువురికి గాయాలు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 02:27 PM

ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కె.బాలింగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతుల కారణంగా రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న ప్రయాణికుల బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa