ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫుడ్స్ తీసుకొంటే మీ జ్ఞాపకశక్తిని ఊష్

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:34 PM

జ్ఞాపకశక్తి పెరగాలని చాలా మంది ట్రై చేస్తారు. దానికోసం కొన్ని ఫుడ్స్ తింటారు. కొన్ని పనులు చేస్తారు. అలా చేసేవాటిలో డైట్ కీ రోల్ పోషిస్తుంది. సరైన ఫుడ్స్ తింటే జ్ఞాపకశక్తి ఎంత బాగా పనిచేస్తుందో.. కొన్ని ఫుడ్స్ తింటే అంతగా మతిమరుపు వేధిస్తుంది. అందుకే, బ్రెయిన్ షార్ప్‌గా పనిచేసేందుకు కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని చెబుతారు. కొన్ని ఫుడ్స్ తింటే త్వరగా మతిమరుపు వస్తుందని చెబుతారు. అలాంటి ఫుడ్స్ గురించి తెలుసుకుని ముందుగానే వాటికి దూరంగా ఉంటే మంచిది సూచిస్తున్నారు. అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి. చక్కగా అన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఫుడ్స్‌కి దూరంగా ఉండడం మంచిది.


ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్


మనకి నూనెలో ఫ్రై చేసిన ఫుడ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి. కానీ, అలాంటి సమోసా, చిప్స్, పకోడా వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. బర్గర్‌లోనూ అలానే ఉంటుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎక్కువగా ఉప్పు, సాల్టీగా ఉండే చిప్స్, ఫ్రైస్ అన్నీ కూడా బ్రెయిన్ పనితీరుని నెమ్మదిస్తాయి. కాబట్టి, వీటిని తినకపోవడమే మంచిది.


ప్రాసెస్డ్ స్వీట్స్


మనకి మార్కెట్లో ఎన్నో రకాలైన కూల్ కేక్స్, స్వీట్స్, క్యాండీస్, టోఫీలు, చాక్లెట్స్ వంటి స్వీట్స్ దొరుకుతాయి వీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ పనితీరుని తగ్గిస్తాయి. కాబట్టి, వీటిని తినకపోవడమే మంచిది. వీటిని తినడం వల్ల బరువు ఎలా పెరుగుతారో బ్రెయిన్ కూడా మొద్దుబారుతుందని కాబట్టి, వీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. వీటితో పాటు వైట్ బ్రెడ్, బన్స్, ప్రాసెస్డ్, పాస్తా, పిజ్జా లాంటి బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బ్రెయిన్‌పై నెగెటీవ్ ఎఫెక్ట్స్‌ని పడేలా చేస్తాయి. దీని వల్ల బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. మతిమరుపు కడా పెరుగుతుంది.


ప్రాసెస్డ్ మీట్


​ప్రాసెస్డ్ మీట్, ప్యాకేజ్డ్ మీట్‌లో కూడా హై సోడియం, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. జంక్ ఫుడ్‌లోనూ ఇవి ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్‌ని దెబ్బతీసి సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. వీటిని తింటే బాడీలో ఫ్యాట్ కూడా పెరుగుతుంది. త్వరగా బరువు పెరుగుతారు. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి, వీటిని తినకపోవడమే మంచిది.


ఆల్కహాల్


ఎక్కువగా ఆల్కహాల్ తాగితే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీని వల్ల కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి, అసలే తాగొద్దు. వీటి బదులు, హెల్దీ డ్రింక్స్, హెర్బల్ టీలు తీసుకోవడం మంచిది. కూల్ డ్రింక్స్ కూడా అంత మంచివి కావు. కాబట్టి, దాహంగా అనిపించినప్పుడు నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, పెరుగు వంటివి తీసుకోండి. అంతేకానీ, ఇతర డ్రింక్స్ తీసుకోవద్దు.


ఇతర కారణాలు


అంతేకాకుండా మతిమరుపు రావడానికి కారణాలు స్ట్రెస్, ఒత్తిడి పెరగడం కూడా ఒక కారణమే. కాబట్టి, ఒత్తిడికి దూరంగా ఉండాలి.


నిద్రతక్కువగా ఉన్నా సమస్య వస్తుంది. కాబట్టి, పుష్కలంగా నిద్రపోవాలి.


పోషకాహారం తక్కువగా తీసుకున్నా సమస్య వస్తుంది.


ఇతర బ్రెయిన్‌ ప్రాబ్లమ్స్ ఉన్నా మతిమరుపు వస్తుంది. కాబట్టి, జాగ్రత్త పడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa