ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్లూరు పరిధిలో జరిగిన హత్యపై విచారణ చేస్తున్న మంత్రులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 08:34 PM

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు హోం శాఖ మంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం రాళ్లపాడు గ్రామానికి చేరుకున్నారు. మృతుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు.వివరాల్లోకి వెళ్ళితే.... కొన్ని రోజుల క్రితం రాళ్లపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన హరిశ్చంద్రప్రసాద్ కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వ్యక్తిగత కక్షల కారణంగానే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఆ తర్వాత ఈ హత్య కులం రంగు పులుముకోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మంత్రుల పర్యటన సందర్భంగా, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa