ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ ఎన్నికలవేళ ‘మహాఘట్ బంధన్‌’ కూటమిలో గందరగోళం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 05:08 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ, విపక్ష ‘మహాఘట్ బంధన్‌’ కూటమిలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాకముందే, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఏకపక్షంగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి రాజకీయంగా కలకలం రేపింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్‌గా మారింది.ఈరోజు ఆర్జేడీ ఏకంగా 143 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, వైశాలి జిల్లాలోని రాఘోపుర్‌ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుండగా, ఆర్జేడీ ఈ జాబితాను విడుదల చేయడం కూటమిలో సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 17నే ముగిసింది.కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య పెరిగిన దూరమే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విభేదాల కారణంగానే కూటమి తరఫున ఇప్పటివరకు అధికారికంగా సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా, తొలి విడతలో పోలింగ్ జరగనున్న 121 స్థానాలకు గాను, కూటమి పార్టీలు కలిసి ఏకంగా 125 మంది అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa