కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనానికి దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఓర్పుగా భరిస్తూ శ్రీవారిని దర్శించడానికి వారు ప్రయత్నిస్తారు.భక్తులు తిరుమలకు చేరుకోవడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది సొంత వాహనాల్లో ప్రయాణిస్తే, మరికొంత మంది ప్రజా రవాణా వాహనాలను ఉపయోగిస్తారు. తిరుపతి నుండి తిరుమలకు చేరుకునే రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి:ఘాట్ రోడ్లు – వాహనాల్లో ప్రయాణించే భక్తులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు.మెట్లు – అలిపిరి, శ్రీవారి మెట్లు ద్వారా భక్తులు కొండపైకి ఎక్కి దర్శనానికి చేరుతారు.
*వాహనదారులకు ముఖ్యమైన సూచన: హెల్మెట్ లేకుండా ఆ జిల్లాలోకి ఎంట్రీ నిషేధం.మంగళవారం రాత్రి ఘాట్ రోడ్ ద్వారా తిరుమలకు వెళ్తున్న కొంతమంది భక్తులకు ఒక వింత అనుభవం ఎదురైంది. రాత్రి 9 గంటల సమయంలో రెండో ఘాట్ రోడ్డులో కొండ చిలువ కనిపించింది. కారులో వినాయక స్వామి ఆలయాన్ని దాటి వెళ్తున్న భక్తులు ఈ అసాధారణ దృశ్యాన్ని చూశారు. కొంతమంది భక్తులు భయంతో ఫోన్లలో వీడియో కూడా తీశారు, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
*ఎస్వీ గోశాల పరిశీలన : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం పరిశీలించారు. గోశాల నిర్వహణ, గోవులకు అందే దాణా, వసతి, వైద్యం, తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారుల నుండి వివరాలు సేకరించారు.500 గోవులకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనం ఆధునిక వసతులతో నిర్మించబడినట్లు గోశాలలో వీక్షించారు. గోవులు, దూడల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. గోశాలోని పశు సంఖ్య, అగరుబత్తీల యూనిట్, దాణా మిక్సింగ్ ప్లాంట్ కార్యకలాపాలను కూడా ఈవో తన వద్ద చూసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa