విజయ డెయిరీ మాజీ ఛైర్మన్, పాడి రైతుల సంక్షేమ సారథి మండవ జానకిరామయ్య (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పాడి పరిశ్రమకు, ముఖ్యంగా విజయ డెయిరీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.సుమారు 27 సంవత్సరాల పాటు విజయ డెయిరీ ఛైర్మన్గా మండవ జానకిరామయ్య సుదీర్ఘకాలం సేవలందించారు. తన పదవీకాలంలో పాడి రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేశారు. రైతుల నుంచి పాలు సేకరించడం నుంచి వారికి గిట్టుబాటు ధర కల్పించడం వరకు అనేక సంస్కరణలు చేపట్టి, వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆయన నాయకత్వంలో విజయ డెయిరీ అభివృద్ధి పథంలో పయనించింది.మండవ జానకిరామయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలను ఈ సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa