రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ముస్లింలు చేరవచ్చా? అనే ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా సంఘ్లోకి వచ్చేటప్పుడు తమ మతపరమైన గుర్తింపును పక్కనపెట్టి రావాలని స్పష్టం చేశారు. "సంఘ్లో బ్రాహ్మణులకు, ఇతర కులాల వారికి, ముస్లింలకు, క్రైస్తవులకు అంటూ ప్రత్యేకంగా ప్రవేశం ఏమీ ఉండదు. ఆర్ఎస్ఎస్ లోకి వచ్చేటప్పుడు మీరు భారతమాత బిడ్డగా మాత్రమే రావాలి" అని ఆయన వివరించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వస్తున్నారని, అయితే తాము వారి సంఖ్యను లెక్కించబోమని, వారి వివరాలు అడగబోమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa