భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో సఖ్యతతో మెలగాలని కోరుకుంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్ మాత్రం మనతో శాంతియుతంగా ఉండాలని అనుకోవడం లేదని ఆయన ఆరోపించారు. భారత దేశానికి హాని కలిగించడం ద్వారానే పాక్ సంతృప్తి చెందుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ శాంతి కోరుకోవడం మంచిది కాదని, పాక్ కు అర్థమయ్యే భాషలోనే జవాబివ్వడం మంచిదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కు నష్టం కలిగేలా ప్రతిసారీ ఓడిస్తూనే ఉండాలని చెప్పారు. అప్పుడు పాక్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అన్నారు. శాంతిని కోరుకోని వారికి అశాంతిని రుచి చూపించడం ద్వారానే బుద్ధి చెప్పాలని అన్నారు. 1971లో భారత సైన్యం ధాటికి పాకిస్థాన్ 90వేల మంది సైనికులను కోల్పోయిందని, అయినా సరే ఆ దేశ పాలకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. భారత్ ను తాము చేయగలిగింది ఏమీలేదని పాక్ కు అర్థమయ్యే వరకూ ప్రతి దాడి చేయాలన్నారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa