ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జియోతో డబ్బు సంపాదన.. ఈ చిన్న పనితో రూ.72 వస్తూనే ఉంటాయ్

business |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 11:05 PM

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో కొత్త తరహా ఆలోచనతో వచ్చింది. జియో డిజిటల్ ఛాంపియన్ పేరుతో సరికొత్త రిఫరల్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. తమ అధికారిక సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ఈ కొత్త ప్రోగ్రామ్ ప్రకటించింది. తమ యూజర్లు నెట్‌వర్క్ రిఫర్ చేస్తూ వాటిని రివార్డ్స్‌గా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. జియో స్టార్టర్ ప్యాక్‌లను ఇతరులకు రిఫర్ చేస్తూ కస్టమర్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ఇతర బెనిఫిట్స్ సైతం లభిస్తాయి. అలాగే ఈజీమైట్రిప్ భాగస్వామ్యంతో లైఫ్ స్టైల్ రివార్డ్స్ సైతం అందిస్తోంది. మరి ఈ కొత్త తరహా ప్రోగ్రామ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.


ఎవరైనా జియో డిజిటల్ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇందులో చేరి డబ్బులు, రివార్డులు సంపాదించాలనుకుంటారో వారు జియోకు చెందిన డిజిటల్ ఛాంపియన్ వాట్సాప్ నంబర్ 80103 53535 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. దీంతో ప్రోగ్రామ్ సంబంధించిన వివరాలు వస్తాయి. అందులో రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో వారికి సంబంధించిన ప్రత్యేకమైన రిఫరల్ లింక్ వస్తుంది. ఆ లింకును తమ స్నేహితులు, బంధువులకు పంపించడం, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయాల్సి ఉంటుంది.


ఎవరైనా ఆ లింక్ సాయంతో జియో స్టార్టర్ రీఛార్జ్ ప్యాక్ రూ.349తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 20 శాతం కమిషన్ అంటే రూ.72 వస్తాయి. అలా ఎన్ని సార్లు రీఛార్జ్ చేసుకుంటే అన్ని సార్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని రిఫర్స్ అనేది గరిష్ఠ పరిమితి అనేది లేదు. ఎన్నిసార్లైనా లింక్ పంపొచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి రూ.72 చొప్పున డబ్బులు గెలుచుకుంటారు. అలాగే అన్‌లిమిటెడ్ రివార్డ్స్ పొందవచ్చు. వీటికి అదనపు బెనిఫిట్స్ సైతం ఉన్నాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో టాప్ రిఫరల్స్‌ పేర్లను జియో పోస్ట్ చేస్తుంది. ప్రతి నెల టాప్-3కి గోవా ట్రిప్ లభిస్తుంది. మూడు రోజులు రెండు రాత్రుల చొప్పున ఈజీమై ట్రిప్ ద్వారా గోవా ట్రిప్ పొందవచ్చు.


కొత్త కస్టమర్లు సైతం ఈ రిఫరల్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ పొందవచ్చు. షేర్ చేసిన లింక్ ద్వారా జియో సిమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ అందుతాయి. వారు పాపులర్ బ్రాండ్స్ నుంచి ఆఫర్స్ పొందవచ్చు. ఈజీమైట్రిప్ ద్వారా విమాన టికెట్లపై రూ.2,220 తగ్గింపు పొందడంతో పాటు హోటల్ ఛార్జీలపై 15 శాతం తగ్గింపు లభిస్తుంది. అజియోలో రూ.1000 పైన కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్విగ్గీలో రూ.499పైన ఆర్డర్ చేస్తే రూ.150 తగ్గింపు లభిస్తుంది. అయితే, ఈ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే కస్టమర్లు ఆన్‌లైన్ రిఫరల్ లింక్ ద్వారా జియో సిమ్ ఆర్డర్ చేసుకుని సెల్ఫ్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa