ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి రానున్న ప్రధాని.. వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 23 వరకు పది రోజుల పాటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జయంతి ఉత్సవాలను హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల ఏర్పాట్లపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తాజాగా మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఎమ్మెస్ రాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్జైన్ పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీతో కలిసి మంత్రి అనగాని ప్రసాద్ పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa