మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం వంద రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "50 ఎకరాల మెడికల్ కాలేజీ భూముల ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. కానీ, కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల రాష్ట్రం సుమారు 2150 మెడికల్ సీట్లను కోల్పోతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.పులివెందులలో 50 సీట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినా, చంద్రబాబు అడ్డుపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాశారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ ‘నాడు–నేడు’ కింద ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు అవన్నీ మూలన పడ్డాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa