ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్ అందనుంది. గురువారం ఉదయం 9 గంటలకు ఏపీకి శుభవార్త అందనుంది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా నారా లోకేష్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలతో పాటుగా పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులకు సంబంధించి గురువారం ఉదయం మరో కీలక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్తో ఇప్పుడు ఈ విషయంపై చర్చ జరుగుతోంది.
"2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక సంస్థ.. తుపానులా రేపు ఆంధ్రప్రదేశ్కు తిరిగి వస్తోంది. వారు ఎవరంటే.. పూర్తి వివరాలు రేపు ఉదయం 9 గంటలకు.. వేచి ఉండండి!!" అంటూ నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. 'బిగ్ అన్వీల్' అంటూ చేసిన ఈ పోస్టు చేసిన నారా లోకేష్.. #InvestInAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్ట్యాగ్స్ జతచేశారు. ఈ నేపథ్యంలో ఏదా కంపెనీ అనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. కొంతమంది లులు గ్రూప్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే లులు గ్రూప్ కోసం ఇప్పటికే విశాఖ, విజయవాడలో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇక్కడ లులు షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనిపై గత కొంతకాలంగా చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఏదా కంపెనీ అంటూ నెటిజనం చర్చించుకుంటున్నారు. నారా లోకేష్ ప్రకటించిన ఆ సంస్థ ఏది? ఎంత పెట్టుబడులు పెట్టబోతోంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సును ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సు ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సుపై మంత్రి నారా లోకేష్.. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్.. కంపెనీలు ఏపీని ఎంచుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయన్నారు. ఒకటి సీఎం చంద్రబాబు అయితే, రెండోది వేగవంతమైన ప్రక్రియ, మూడోది ఎకో సిస్టమ్ అని వివరించారు. ఈ కారణంగానే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ రాష్ట్రాన్ని ఎంచుకున్నాయన్నారు.
2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో 410 ఎంవోయూలు జరుగుతాయన్న నారా లోకేష్.. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా ఏడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నారా లోకేష్ అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa