ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అయన మాట్లాడుతూ... పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, స్వచ్చంధ సంస్ధలు, విద్యార్ధులు, మేధావులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయాల్లో నిరసన ర్యాలీ నిర్వహించి.. గౌరవ గవర్నర్ గారికి తాసీల్దార్లు ద్వారా వినతిపత్రం సమర్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa