ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పేలుడు ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య

national |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:57 PM

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమ‌వారం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో గాయపడి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 13కి చేరింది.వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం జరిగిన తీవ్రస్థాయి పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరైన బిలాల్ అనే వ్యక్తి ఎల్ఎన్‌జేపీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు.బిలాల్ మృతితో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. మృతదేహానికి ఈరోజే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa