ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో యాక్టివ్‌గా ఉంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 01:44 PM

వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో యాక్టివ్‌గా ఉంటే పోలీస్‌స్టేషన్లకు పిలిపించి కేసులు పెడతామని బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని వైయ‌స్‌ఆర్‌సీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ అన్నారు. న్యాయం కోసం అవసరమైతే పోలీస్‌స్టేషన్‌ ఎదుటే బైఠాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ విజయవంతమైంది. ఈ క్రమంలో ర్యాలీలో యాక్టివ్‌గా పాల్గొన్న వారిని గుర్తించి వారిలో కొందరు యువజన, మైనార్టీ నేతలను గురువారం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత లీగల్‌ సెల్‌ నాయకులతో కలిసి త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై సీఐ రాజేంద్రనాథ్‌తో మాట్లాడారు. పాత కేసులున్న వారిని స్టేషన్‌కు పిలిపించినట్లు సీఐ చెప్పగా.. ఒక్క కేసు కూడా లేని వాళ్లను కూడా తీసుకొచ్చారని సాకే చంద్రశేఖర్‌ తెలియజేశారు. పైగా అసభ్యంగా మాట్లాడుతూ బెదిరించి పోలీసులే చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa