విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీని పెట్టుబడులకు గేట్ వేగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరోవైపు సీఐఐ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే 2,500 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఏరో స్పే్స్, డ్రోన్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్న సంగతిని చంద్రబాబు వివరించారు. మరోవైపు చంద్రబాబు ప్రకటన తర్వాత డ్రోన్ ట్యాక్సీ అంటే ఏమిటనే దానిపై చర్చ మొదలైంది.
డ్రోన్ ట్యాక్సీ అనేది ఓ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది రిమోటెడ్గా లేదంటే స్వయంగా పనిచేస్తుంది. డ్రోన్ ట్యాక్సీ సాయంతో ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటారు. డ్రోన్ ట్యాక్సీనే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అని పిలుస్తుంటారు. రవాణాకు వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఈ డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తున్నాయి. చైనా వంటి కొన్ని దేశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు డ్రోన్ టాక్సీలు హెలికాప్టర్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే పైలెట్ సాయం లేకుండానే తక్కువ దూరం ప్రయాణాలకు ఇవి ఉపయోగపడుతుంటాయి. ప్రయాణికులకు ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా తీసుకెళ్లటంలో డ్రోన్ ట్యాక్సీలు ఉపయోగపడుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం సీఐఐ సదస్సు వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా వర్చువల్గా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. మొత్తంగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో టెస్టింగ్- సర్టిఫికేషన్ సెంటర్లు ఏర్పాటుచేస్తారు.
అలాగే 25 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఇక తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో స్పేస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ సిటీ వలన 10 సంవత్సరాలలో రూ.25వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా. అలాగే 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ సిటీ , స్పేస్ సిటీలకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa