ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్

international |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:09 PM

గతేడాది బంగ్లాదేశ్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్త ఆందోళనలలు నిర్వహించిన అక్కడి యువత ప్రభుత్వాన్ని కూలదోశారు. దీంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. అనంతరం ఆ దేశ ఆపద్ధర్మ నేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది జరిగిన అల్లర్లలో అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకుగానూ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసుల విషయంలో నవంబర్ 17న తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక వాతావరణ నెలకొంది. గురువారం కూాడా బంగ్లాలో అక్కడక్కడ హింస చెలరేగినట్లు తెలుస్తోంది. ట్రైబ్యునల్ తీర్పు సమయంలో పలు చోట్ల దాడులు జరుగుతుండటంతో.. గత పరిణామాలను దృష్టిపెట్టుకొన్న ప్రభుత్వం.. భద్రత కట్టుదిట్టం చేసింది. మరీ ముఖ్యంగా తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) చుట్టూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.


డ్రైబ్యునల్ తీర్పుకు నిరసనగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్.. లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో పాటు తీర్పు నేపథ్యంలో దాడులు జరుగుతున్నందున.. గురువారం పోలీసులు, బోర్డర్ గార్డ్ సెక్యూరిటీని భారీ స్థాయిలో మోహరించారు. రాజధాని ఢాకాలోకి ప్రవేశించే మార్గాల వద్ద పలు చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు, పాఠశాలలు, కాలేజీలు, రవాణాపై గురువారం (నవంబర్ 13) తీవ్రంగా ప్రభావం పడింది. ఢాకా సహా బంగ్లాదేశ్ మేజర్ సిటీల్లో పాఠశాల తరగతులు, పరీక్షలు ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడంతో రవాణాపై కూడా ప్రభావం పడింది.


గత మూడు రోజులుగా బంగ్లాదేశ్‌లో అక్కడక్కడా అల్లర్లు కొనసాగుతున్నాయి. బుధవారం (నవంబర్ 12) కూడా బంగ్లాలో హింస చెలరేగింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఇక తూర్పు బంగ్లాదేశ్‌లో ఓ గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టడం వల్ల దగ్ధమైందని స్థానిక మీడియా తెలిపింది. కాగా, ట్యైబ్యునల్ విచారణను ఆవామీ లీగ్ వ్యతిరేకిస్తోంది. లాయర్‌ను నియమించుకునేందుకు హసీనాకు అవకాశం ఇవ్వలేదని తెలిపింది. ఐసీటీని కంగారూ కోర్టు అని అభివర్ణించింది. లాయర్‌ను నియమించుకోకుండా బంగ్లా ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించింది.


షేక్ హసీనా ప్రాణాలు కాపాడిన 20 నిమిషాలు..


గతేడాది యువత నిరసనల కారణంగా.. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భారత్‌కు వచ్చారు షేక్ హసీనా. దీనిపై ఇటీవల కీలక విషయాలు బయటకు వచ్చాయి. భారత్ నుంచి వెళ్లి ఓ ఫోన్ కాల్‌ ఆమెను కాపాడినట్లు తెలిసింది. ఆ ఫోన్ కాల్ 20 నిమిషాలు ఆలస్యమైతే.. హసీనా ప్రాణాలతో ఉండేవారుకాదట. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇన్షా బంగ్లాదేశ్.. ది స్టోరీ ఆఫ్ యాన్ అన్‌ఫినిష్డ్ రివల్యూషన్' అనే పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa