విశాఖలో టీడీపీ నాయకుడి కోల్డ్ స్టోరేజ్లో అరబ్ దేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన 189 టన్నుల గోమాంసాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకోవడంతో ఏం చేయాలో పాలుపోక, కల్తీ నెయ్యి పేరుతో తిరుమల వేదికగా మరోసారి కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కడప జిల్లాలోని వేంపల్లెలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన క్షుద్ర రాజకీయాల కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఎద్దేవా చేశారు. పెట్టుబడుల సదస్సుల పేరుతో వైయస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలతోనే మరోసారి ఒప్పందాలు చేసుకుంటూ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్డీఏను గెలిపించడానికి బీహార్ దాకా వెళ్లిన లోకేశ్, తాను పుట్టిపెరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు? చంద్రబాబు, లోకేశ్కి జాకీలు వేయడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా పత్రికా విలువలను తుంగలో తొక్కి మరీ తెలుగుదేశం పార్టీకి భజన చేస్తుందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రజా ఉద్యమం జరిగితే కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణ తర్వాత వారిని పిలిచి చెప్పినట్టు తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ అంటూ పచ్చి అబద్ధాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa