టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం వెనుక సిట్ వేధింపులు ఉన్నాయి. ఇది ముమ్మాటికే ప్రభుత్వ హత్యేనని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపులతో ఆత్మహత్యకు పురిగొల్పారని, విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైనట్టుగా సన్నిహితులు సమాచారం అందించారన్నారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... గడిచిన రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించిన వార్తల వల్ల కూడా సతీష్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. మరోవైపు వారం రోజులగా సీఐడీ విచారణ నేపధ్యంలో... వారిదీనిపై వేధింపులు తాళలేక.. ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని ఆయన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం వచ్చింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. సతీష్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి వైయస్ఆర్సీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa