తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తుంగభద్ర బోర్డులోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్లు, బోర్డు చైర్మన్తోపాటు బళ్లారి, సిరుగుప్ప, కంప్లి, కొప్పళ, విజయనగర, రాయచూరు ఎమ్మెల్యేలు, మంత్రులు నాగేంద్ర, గణేష్, బోసురాజు, రాఘవేంద్ర హిత్నాల్, రైతు సంఘం నాయకులు హాజరయ్యారు. తుంగభద్ర జలాశయంలో శుక్రవారానికి 75.989 టీఎంసీల నీరు నిల్వ ఉందనీ, ప్రసుత్తం డ్యాం ఆయకట్టులో పంటను కాపాడేందుకు నీటిని వినియోగించేలా తీర్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa