ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌ లో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన అధిష్టానం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 04:34 PM

క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, బీహార్‌కు చెందిన సీనియర్ నేత ఆర్‌కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన మరుసటి రోజే ఈ చర్య తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనపై ఈ వేటు వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆర్‌కే సింగ్ ఎన్డీయే నాయకత్వంపైనా, బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లింది. అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలి" అని బీజేపీ జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa