బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఫేమస్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ (త్రిపురారి కుమార్ తివారీ)కి రాజకీయ అరంగేట్రంలోనే తీవ్ర పరాభవం ఎదురైంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్.. యువతలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. చన్పటియా నియోజకవర్గంలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను ఆయన అధిగమించలేకపోయారు. జన్ సురాజ్ పార్టీ తరపున చన్పటియాలో పోటీ చేసిన 34 ఏళ్ల మనీష్ కశ్యప్.. 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.
ఈ నియోజకవర్గంలో మహాఘట్బంధన్లోని కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ రంజన్.. బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్పై విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మనీష్ కశ్యప్ కేవలం 37 వేల కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లకు మాత్రమే పొందారు. మనీష్ కశ్యప్కు యూట్యూబ్లో 96 లక్షల మంది (9.6 మిలియన్లు) సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఈ ఆన్లైన్ ఫాలోయింగ్ను ఓట్ల రూపంలో మలచడంలో ఆయన పూర్తిగా విఫలమైంది. స్థానిక సమస్యలపై యూట్యూబ్, సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. భారీగా పాపులారిటీ తెచ్చుకున్న మనీష్ కశ్యప్.. ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
2023లో తమిళనాడులో బిహార్ వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయని.. కొందరు కూలీలను హత్య చేస్తున్నారంటూ.. ఆయన నకిలీ వీడియోలను తయారు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే దీనిపై చేసిన దర్యాప్తులో అవి నకిలీవి అని తేలడంతో.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను అప్పట్లో తమిళనాడు పోలీసులు మనీష్ కశ్యప్ను అరెస్ట్ చేశారు.
వివాదాల తర్వాత.. 2024లో బీజేపీలో చేరిన మనీష్ కశ్యప్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నంత మాత్రాన.. రాజకీయాల్లో సక్సెస్ అవుతారు అనేది అంతా అబద్ధమని మనీష్ కశ్యప్ ఓటమి.. మరోసారి నిరూపించింది. ఇది బిహార్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి కూడా మరో గట్టి ఎదురుదెబ్బగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa