ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌తీశ్‌కుమార్‌ మరణంపై విచారణ జరిపించి నిజాలు బయటికి తేవాలి కానీ, వైసీపీ నేతలపై దుష్ప్రచారం చెయ్యడం ఏంటి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 02:55 PM

స‌తీశ్ కుమార్ అనుమానాస్ప‌ద మృతి కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను ఇరికించే కుట్ర జ‌రుగుతోంద‌ని, అందులో భాగంగానే ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా స‌తీశ్‌కుమార్‌ది హ‌త్యేనంటూ ఎల్లోమీడియా, టీడీపీ నిర్ధార‌ణ చేసి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌పురంలోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ‌మే అఘాయిత్యం చేసి మా పార్టీపై రుద్దాల‌ని చూసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులే చంపారంటూ టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి మాట్లాడిన మాట‌లు అందుకు బ‌లం చేకూరుస్తున్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని గోరంట్ల‌ మాధవ్ డిమాండ్ చేశారు. దుర్ఘ‌ట‌న త‌ర్వాత రైల్వే పోలీసులు, టీసీలు, భోగీలో ఉన్న ప్ర‌యాణికుల‌ను ఎందుకు విచారించ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa