ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సతీష్‌కుమార్‌ మృతికేసులో వైసీపీ నాయకులని ఇరికించాలని చూస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 02:56 PM

టీటీడీ మాజీ అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏవీఎస్‌ఓ) సతీష్‌కుమార్‌ మృతి కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మాజీ మంత్రి సాకే శైలజానాధ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని స్పష్టం చేసిన ఆయన, ఈ కేసును సీబీఐతో లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.అయన మాట్లాడుతూ...  పరకామణి చోరీ కేసులో సిట్‌ విచారణలో ఉన్న సీఐ సతీష్‌కుమార్‌ మరణం అత్యంత విచారకరం. కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ మరణంపై ప్రజల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. సతీష్‌కుమార్‌ మృతి విషయం తెలియగానే, టీడీపీ నాయకులు చాలా వేగంగా స్పందించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాకుండానే, పోస్ట్‌మార్టమ్‌ కూడా పూర్తి కాకుండానే మా వైయ‌స్ఆర్‌సీపీపై నిందలు వేస్తూ, ఆయన్ను మా పార్టీ నాయకులే హత్య చేశారని నిరాధార పిచ్చి ఆరోపణలు చేశారు. ఆ విధంగా ప్రభుత్వం ఈ కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ఇరికించే కుట్ర చేస్తోంది. మరోవైపు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది అత్యంత హేయం అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa