ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 06:28 PM

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా.. ‘తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభాగం. రోజురోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి’ అని ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa