టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో వన్డేలో అజేయ అర్ధశతకం (68 నాటౌట్) సాధించడంతో అతని సగటు 57.80కి చేరింది. ఈ క్రమంలో చతేశ్వర్ పుజారా (57.01)ను అధిగమించాడు. ప్రపంచ క్రికెట్లో మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే అతని కంటే ముందున్నాడు. గైక్వాడ్ 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్లలో 17 శతకాలు, 18 అర్ధశతకాలతో 4509 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa