ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం అధిష్టానందే

national |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 04:35 PM

కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలతో రాజకీయాలు వేడెక్కాయి. కేబినెట్ మార్పులకు అనుమతి కోరుతూ సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో మరోసారి చర్చలు జరపాలని ఖర్గే సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.శనివారం రాహుల్ గాంధీతో సమావేశమైన సిద్ధరామయ్య కేబినెట్ మార్పుల ఆవశ్యకతను వివరించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ ఆదివారం ఖర్గేతో భేటీ అయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి మార్పుపై ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఆ తర్వాతే ఇతర అంశాలు చర్చించాలని శివకుమార్ పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఇరు నేతలతో చర్చించిన ఖర్గే.. తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలేసినట్లు కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa