ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు,,,,భారతీయులకు గట్టి షాక్ ఇచ్చిన ఇరాన్

international |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 09:27 PM

భారతీయులకు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించేందుకు కల్పించిన సదుపాయాన్ని ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ వీసా-ఫ్రీ ఎంట్రీని నవంబర్ 22 నుంచి రద్దు చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం సోమవారం రోజు ప్రకటించింది. సాధారణ పాస్‌పోర్టులు కలిగిన భారతీయులు అందరూ ఇకపై ఇరాన్‌లోకి ప్రవేశించాలన్నా, ప్రయాణించాలన్నా తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో భారతీయ పౌరులు ఎక్కవగా మోసపోతున్నారని, ముఖ్యంగా ఈ వీసా రద్దు సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తూ పలువురు వీరిని నేరపూరిత కార్యకలాపాల కోసం వాడుకుంటున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇరాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.


ఉద్యోగ మోసాలు, కిడ్నాప్ ప్రమాదాలు..


భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందిస్తూ.. కొందరు ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో పలువురు భారతీయ పౌరులను ఇతర దేశాలకు పంపిస్తానని హామీలిస్తూ ఇరాన్ పంపించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. వీసా ఫ్రీ సదుపాయాన్ని అడ్డం పెట్టుకుని ఇరాన్‌కు చేరుకున్న అనేక మంది భారతీయులు అక్కడ కిడ్నాప్‌లకు గురై, పెద్ద ఎత్తున డబ్బుల కోసం డిమాండ్లు ఎదుర్కొన్నట్లు ఎంఈఏ వెల్లడించింది. ఈ మానవ అక్రమ రవాణా బాధితులుగా మారుతున్న భారతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఈ సదుపాయం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇరాన్ సర్కారు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.


ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో.. విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ ప్రయాణ సలహా జారీ చేసింది. ఇరాన్‌కు వెళ్లాలని భావించే భారతీయ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వీసా-రహిత ప్రయాణాన్ని ఆఫర్ చేసే లేదా ఇరాన్ మీదుగా మూడవ దేశాలకు పంపుతామని హామీ ఇచ్చే ఏజెంట్లను నమ్మవద్దని తెలిపింది. వారి నుంచి గట్టిగా తప్పించుకోవాలని ఎంఈఏ గట్టిగా సూచించింది. నవంబర్ 22 తేదీ నుంచి సాధారణ పాస్‌పోర్టులు కలిగిన వారంతా తప్పనిసరిగా దౌత్య కార్యాలయాల ద్వారా వీసా పొందిన తర్వాతే ఇరాన్‌కు వెళ్లాలని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa