ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారు సాయిబాబా రథయాత్రతో మొదలైన శతజయంతి మహోత్సవాలు!

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 12:02 PM

పుట్టపర్తి ప్రశాంతి నిలయం నిన్నటి నుంచి భక్తి సముద్రంగా మారిపోయింది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. 9.2 కిలోల బంగారంతో తయారైన స్వామి విగ్రహాన్ని వెండి రథంపై ఊరేగించడం కనుల పండుగగా నిలిచింది. లక్షలాది భక్తులు రోడ్లు రెండు వైపులా నిలబడి “సాయిరాం... సాయిరాం” అంటూ జైకారాలు చేస్తూ ఆ దివ్య దృశ్యాన్ని ఆస్వాదించారు.
సాయంకాలం ప్రశాంతి నిలయంలో గ్రౌండ్‌లో ‘సురంజలి’ పేరిట భక్తి సంగీత కచేరీ జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు పాల్గొని సాయి భజనలు, ఆధ్యాత్మిక గీతాలతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేసారు. ఆకాశమంతా భక్తి రాగాలు మార్మోగాయి. రంగవల్లులు, ఆతశ్బాజీలతో పుట్టపర్తి ఆకాశం కూడా ఉత్సవ రంగుల్లో మునిగిపోయింది.
ఈ రోజు శతజయంతి ముఖ్య ఉత్సవ దినం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని నరి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు కూడా ఈ మహోత్సవంలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు అందుకోనున్నారు.
ఈ శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23 వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగనున్నాయి. “సర్వం సాయిమయం” అనే నినాదంతో పుట్టపర్తి ఇప్పుడు ప్రపంచ భక్తి కేంద్రంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa