అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భవ్యమైన కాషాయ ధ్వజం ఎగురవేయబోతోంది. ఆలయ నిర్మాణం ప్రధాన దశ పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ఈ ధ్వజారోహణ ఉత్సవం దేశవ్యాప్తంగా రామభక్తులను ఉరకలు వేసేలా చేస్తోంది. గర్భగుడి పైన ఉన్న 161 అడుగుల ఎత్తైన శిఖరంపై ఈ భాగవ ధ్వజం రేపరేపలాడనుంది.
ప్రత్యేకంగా తయారు చేసిన ఈ త్రిభుజాకార ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంటుంది. కాషాయ రంగులో సూర్యబింబం, పవిత్రమైన కోవిదార వృక్షం, ఓంకార చిహ్నం బంగారు రంగులో అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ఈ చిహ్నాలన్నీ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి, రామనామంతో ముడిపడినవి కావడం విశేషం.
2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ స్వయంగా భూమిపూజ నిర్వహించగా, 2024 జనవరి 22న రామలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఆలయ ప్రధాన గోపురం పై ధ్వజస్థంభంపై భాగవ జెండా ఎగరడంతో రామమందిర నిర్మాణం ఒక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మంతటా విద్యుత్ దీపాలతో ఆలయం మహారంగు తొడిగి మెరిసిపోతోంది.
ఈ ధ్వజారోహణ ఉత్సవం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, శతాబ్దాల సాధన తర్వాత సాక్షాత్తు రామలల్లా తన జన్మభూమిలో ప్రతిష్ఠితుడైన గొప్ప విజయోత్సవ చిహ్నం. ఈ రోజు అయోధ్య మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ, ‘జై శ్రీరాం’ నినాదాలతో నిండిపోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa