మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం కోసం తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa