ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్, ఇంటెల్, కాగ్నిజెంట్ సీఈఓలు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 06:16 AM

ప్రపంచ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇంటెల్, కాగ్నిజెంట్ సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకొచ్చాయి. మంగళవారం ఆయా సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, దేశంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల తయారీ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.మరోవైపు, ఇంటెల్ సీఈఓ లిప్-బు టాన్ కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్ సెమీకండక్టర్ల తయారీ, డిజైనింగ్ విధానాలను ఆయన ప్రశంసించారు. 'ఇండియా సెమీకండక్టర్ మిషన్'కు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా గ్రూప్‌తో ఇంటెల్ ఒక కీలక ఒప్పందం  కుదుర్చుకుంది. దీని ప్రకారం టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాబ్, ఓశాట్ కేంద్రాల్లో ఇంటెల్ డిజైన్ చేసిన ఉత్పత్తులను తయారు చేసి, ప్యాకేజింగ్ చేస్తారు.అదేవిధంగా, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ సైతం ప్రధానితో సమావేశమయ్యారు. తమ సంస్థ భారత్‌లోని వర్ధమాన నగరాల్లో  విస్తరించేందుకు కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. తద్వారా సమాన అభివృద్ధి, నైపుణ్య వృద్ధికి దోహదపడతామని తెలిపారు. ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ప్రధానితో చర్చించినట్లు కాగ్నిజెంట్ పేర్కొంది.మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ప్రధానితో సమావేశం అనంతరం కీలక ప్రకటన చేశారు. ఆసియాలోనే తమ సంస్థ పెట్టే అతిపెద్ద పెట్టుబడిగా, రాబోయే నాలుగేళ్లలో (2026-2029) భారత్‌లో 17.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa