ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాదికి ఒకేసారి.. టోల్ ఛార్జీ రూ.15 మాత్రమే

business |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 11:14 PM

జాతీయ రహదారులపై ప్రయణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం వార్షిక పాస్‌లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ ధరకే ఎక్కువ సార్లు టోల్ గేట్లను దాటేందుకు అవకాశం కల్పిస్తోంది. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్‌లకు భారీ స్పందన లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. వాహనదారులు పెద్ద సంఖ్యలో వార్షిక ఫాస్ట్ ట్యాగ్‌లను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. టోల్ గేట్ల వద్ద అధిక ఛార్జీలను తగ్గించుకునేందుకు వార్షిక ఫాస్ట్ ట్యాగ్‌లు ఎంతగానే ఉపయోగపడతాయన్నారు.


ఈ ఏడాది ఆగస్టు నెలలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక ఫాస్ట్ ట్యాగ్‌ పాసులను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలోనే 40 లక్షల వార్షిక ఫాస్టా ట్యాగ్ పాస్‌లు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర తెలిపారు. 2026 నాటికల్లా దేశ వ్యాప్తంగా ఆటో మేటిక్ టోల్ కలెక్షన్ పద్ధతి అమలు కానున్నట్లు తెలిపారు. టోల్ ఛార్జీ కేవలం రూ. 15 పడుతోందని, చాలా తక్కువ ధరకే ప్రైవేట్ వాహనదారులు టోల్ గేట్లను దాటేందుకు అవకాశం లభిస్తుందన్నారు.


వార్షిక టోల్ పాస్ కింద ఒకేసారి రూ. 3000 చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది మొత్తం ఉపయోగించుకోవచ్చు. లేదంటే 200 టోల్ ప్లాటాలను దాటే అవకాశం ప్రైవేట్ కార్లకు ఈ వార్షిక పాస్‌ వల్ల కలుగుతోంది. ఒక టోల్ గేట్ వద్ద కేవలం రూ.15 మాత్రమే పడుతుందని చెప్పవచ్చు. విడిగా అయితే ఇందుకు రూ. 15 వేల వరకు అవుతుంది. 2026 కల్లా దేశంలోని నేషనల్ రహదారులపై ఉన్న 1050 టోల్ ప్లాజాల్లో వాహనం ఆపాల్సిన అవసరం లేకుండా ఆటో మేటిక్ టోల్ కలెక్షన్ జరగడానికి ఆధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో వాహనదారులకు టోల్ గేట్ల వద్ద తలెత్తే ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఇకపై జాతీయ రహదారులపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa