కోనసీమ సంస్కృతికి ప్రతీకగా నిలిచే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొసలపల్లి శివారులోని జగ్గన్నతోటలో ప్రతి ఏడాది మకర సంక్రమణ సమయంలో జరిగే ఈ వేడుకలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సందర్భంగా 11 గ్రామాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa